- జగన్రెడ్డి క్రూరత్వానికి ఆరేళ్లు
- ప్రచార పిచ్చితో ప్రాణాలు తీస్తున్నారు
- ఏ మొఖం పెట్టుకుని ఇళ్లకు వెళతారు
- రప్పా రప్పా కోస్తామని వెళతారా?
- కూటమి పాలనలో మీ ఆటలు సాగవు
- రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వదిలిపెట్టం
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- హోంమంత్రి వంగలపూడి అనిత
మంగళగిరి(చైతన్యరథం): ప్రజా వేదిక కూల్చివేతతో 2019 జూన్ 25న జగన్ విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టాడు..ఆ ఘటనతోనే జగన్ పతనం ప్రారంభం అయింది.. దాని ఫలితమే 11 సీట్లు..అయినా బుద్ది రాకుండా విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నాడు..కూటమి పాలనలో వారి ఆటలు సాగవు.. లా అండ్ ఆర్డర్ అతిక్రమిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. టీడీపీ కేంద్ర కార్యా లయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విధ్వంసమే ఎజెండాగా జగన్రెడ్డి ఐదేళ్ల పాలన సాగింది. రూ.8 కోట్లతో కట్టిన ప్రజా వేదికను కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి కూల్చాడు. .ఇప్పటికీ ఆ శకలాలు అక్కడే ఉన్నాయి. అధికారం పోయినా కూడా హింసా వాతావరణాన్నే సృష్టించాలని జగన్రెడ్డి యత్నిస్తు న్నాడని ధ్వజమెత్తారు. అన్న క్యాంటీన్లు నిర్వీర్యం చేసి మూసేశాడు ..ఎక్కడా సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితి లేదు.. పోలవరాన్ని మూలన కూర్చోబెట్టాడు..అమరావతిని శ్మశానంతో పోల్చి మూడు ముక్క లాట ఆడాడు. ఎవరైనా గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టా రు. ప్రశ్నిస్తే రోడ్లపై కొట్టారు..ఎక్కువగా ప్రశ్నిస్తే హత్యలు చేశారు. నాడు అన్ని వ్యవస్థలను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశాడు. చీప్ లిక్కర్పై కూడా రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చిన ఘనుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్రెడ్డే. ఆడ వారిపై బూతులు తిట్టించాడు.. అసెంబ్లీ సాక్షిగా చంద్ర బాబు ను కన్నీళ్లు పెట్టుకునేలా చేశారు. నేడు సిగ్గులేకుండా వైసీపీ మూకలు బయటకు వచ్చి నీతులు మాట్లాడుతున్నారని మండిపడ్డా రు.
కూటమి పాలనలో ప్రశాంతంగా ప్రజలు
నాడు జగన్రెడ్డి బయటకు రావాలంటే పరదాలు ఉండాలి, చెట్లు నరకాలి, షాపులు మూసేయాలి.. మీటింగ్ పెట్టాలంటే టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్లు చేయాలి. జగన్ రెడ్డి గురించి సోషల్ మీడియాలో గెట్టిగా ప్రశ్నిస్తే సీఐడీ కేసులు పెట్టి ఇరికించా రు. వయసుతో సంబంధం లేకుండా అరెస్టులు చేశారు. పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకుని సామాన్య ప్రజలను అనేక రకాలుగా హింసించారు. ఈరోజు ప్రజలు ఆంక్షలు లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నారు. ఎక్కడా పరదాలు లేవు,..చెట్లు నరకడం లేదు.. షాపులు మూసివేడయం లేదు.. హౌస్ అరెస్టులు లేవు. చనిపోయి ఏడాది అయిన వ్యక్తి కుటుంబానికి పరామర్శకు వెళతానన్నా కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీతో ఉన్న వ్యక్తికి ఎంత సెక్యూరిటీ కావా లో అంత సెక్యూరిటీని ఇచ్చాం. నాడు జగన్రెడ్డి ఐదేళ్ల పాలనలో బిక్కుబిక్కుమంటూ జనం గడిపారు. లక్షలాదిగా ఉద్యోగస్తులు బయటకు వచ్చి ధర్నా చేస్తే వారిపై కూడా కేసులు పెట్టారు. విధ్వంసానికి, విద్వేషానికి జగన్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్. కూల్చి వేతలు తప్ప కట్టడాలు చేతగాని పరిస్థితి. జగన్ జే ట్యాక్స్కు భయపడి పరిశ్రమలు పారిపోయాయి. పరిశ్రమలు ఏపీలోకి రావాలంటే జగన్రెడ్డి కమీషన్, వాటాలకు భయపడి రాని పరిస్థితి. అటువంటి స్థితి నుంచి నేడు చంద్రబాబు పాలన చూసి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడటమే కాకుండా ఐదు లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించేందుకు సిద్ధం అవుతున్నాయని పేర్కొన్నారు.
చంద్రబాబు విజన్తో అభివృద్ధి పథం
2047 విజనే కాకుండా.. ఐదేళ్ల విజన్ ప్లాన్తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో చంద్రబాబు ముందుకు తీసుకెళుతుంటే అది ఓర్చుకోలేక వైసీపీ మూకలు ఉద్ధండ పండితుల్లా మాట్లాడుతున్నా రు. జగన్ పాలనలో ఆగస్టు 15న రమ్య అనే అమ్మాయిని నడి రోడ్డుపై పొడిచి చంపితే ఒక్కరోజు కూడా బయటకు వచ్చి మాట్లా డలేదు. జగన్రెడ్డి పాలనలో ఎన్నో హత్యలు, అరాచకాలు జరిగినా ఒక్క మాట మాట్లాడలేదు. నేడు 11 సీట్లకు దిగజారిపోవడంతో ఎక్కడ ఎవరు చనిపోతారా.. శవ రాజకీయం చేద్దామా అని ఎదు రు చూస్తూ హింసా రాజకీయాలను ప్రేరేపిస్తున్నాడు. రప్పా రప్పా కోస్తామంటూ విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు. కూటమి పాలన లో వైసీపీ నేతల ఆటలు సాగవని హితవుపలికారు.
అరాచక శక్తులపై అప్రమత్తంగా ఉండాలి
జనాలను రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేసినా.. ఆడబిడ్డలను అవ మానించేలా మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది ఉండదని హెచ్చరించారు. తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. మేము నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా అంబులెన్స్లకు కూడా దారి ఇవ్వకుండా బెట్టింగ్ పెట్టి చనిపోయిన వ్యక్తి కోసం పరామర్శ పేరుతో వెళ్లి ముగ్గురు ప్రాణాలు తీశాడు. తన కార్యకర్త తన కారు టైర్ కింద నలిగి చనిపోతున్నా పట్టించుకోలేదంటే అతని మనస్త త్వం ఏంటో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. బాబాయి హత్య, కోడి కత్తి డ్రామా, గులకరాయి డ్రామా నుంచి మొదలుకుని.. మొన్న పోలీసులపై చెప్పులు విసరడం, మహిళలపై దాడులు చేయించడం అందరూ గమనిస్తున్నారు. మళ్లీ ఏ మొఖం పెట్టుకుని ఇంటింటికి వెళతారు.. రప్పా రప్పా కోస్తామని వెళతారా? జనాల వద్దకు వెళితే జనం మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబే అని బల్లగుద్ది చెబుతారు. అమ్మకు వందనం ఇచ్చాం..మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం..డీఎస్సీ ఇవ్వబోతున్నాం.. రైతులకు ధాన్యం బకాయిలు ఇచ్చాం..త్వరలోనే మహిళలకు ఉచిత బస్ అమలు చేయబోతు న్నాం. రైతులకు ఖాతాల్లో నగదు వేయబోతున్నాం. కూటమి ప్రభు త్వం చేస్తున్న మేలును ప్రజలు గమనిస్తున్నారు.. ఎవరిది మంచి ప్రభుత్వమే ప్రజలే అర్థం చేసుకుని అరాచక శక్తులపై అప్రమ త్తంగా ఉండాలని సూచించారు.